చదువుకునే విద్యార్థులకు మధ్యలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనే
ఉద్దేశ్యంతో.. రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు ఉపకార వేతనాలు అందిస్తుంటాయి.
అవే చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఊపిరి పోస్తున్నాయి. కేంద్ర
ప్రభుత్వంతో సహా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తన విద్యార్థుల కోసం వివిధ
స్కాలర్షిప్ పథకాలను అమలు చేస్తున్నాయి. 12వ తరగతిలో 60 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల కోసం
అటువంటి స్కాలర్షిప్ పథకం ఒకటి ఉది. అయితే.. దీన్ని సాధించడానికి కొన్ని
నియమాలు ఉన్నాయి.. మీరు ఈ నిబంధనల పరిధిలోకి వస్తే ఈ పథకం యొక్క
ప్రయోజనాలను పొందుతారు. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ స్కాలర్షిప్ పేరు PM స్కాలర్షిప్ పథకం. 12వ తరగతిలో 60 శాతానికి పైగా
మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి ఇది వర్తిస్తుంది. ఈ పథకం ముఖ్యంగా
పోలీసు సిబ్బంది, అస్సాం రైఫిల్స్, ఆర్పిఎఫ్ జవాన్లు మరియు ఉగ్రవాద దాడి
లేదా నక్సలైట్ల దాడిలో మరణించిన వారి వితంతువుల కోసం. దాని సహాయంతో ఈ కుటుంబాల పిల్లల చదువులో ప్రభుత్వం ఆర్థిక సహాయం
అందించడానికి ప్రయత్నిస్తుంది. ఈ స్కాలర్షిప్ పథకాన్ని UGC, AICTE మరియు
MCI సంస్థలు సంయుక్తంగా అందజేస్తున్నాయి. విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కోసం
ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా చదవండి.. ఎక్కడి నుండైనా విద్యార్థిగా
ఉండండి… మీరు 12వ తరగతిలో 60 శాతం కంటే ఎక్కువ మార్కులు పొందినట్లయితే PM
స్కాలర్షిప్ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు PM స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే.. ముందుగా మీరు దాని అధికారిక వెబ్సైట్ www.aicte-india.orgని సందర్శించాలి. ఇక్కడికి వెళ్లిన తర్వాత.. మీరు PM స్కాలర్షిప్ స్కీమ్ని కలిగి ఉన్న
ట్యాబ్పై క్లిక్ చేసి, అన్ని విధానాలను సరిగ్గా అనుసరించండి. దీని తర్వాత
అప్లికేషన్ ఫారమ్ ను ఆన్ లైన్ లో సమర్పించాలి. ఈ స్కీం ద్వారా నెలకు బాలురకు అయితే.. రూ.2500, బాలికలకు అయితే రూ.3000
ఇవ్వడం జరుగుతుంది. అంటే సంత్సరానికి రూ.36వేలు బాలికలకు , రూ.30 వేలు
బాలురకు ఈ స్కాలర్ షిప్ పథకం కింద అందజేస్తారు.
Farmer suside chesukunna raithu pallalaku kuda esthe bagundu farmer ki value lekunda chesthunnaru
ReplyDeleteNice information but farmers suside చేస్తున్నారు వి ఎలుగ్గ్
ReplyDelete