టీ ఎస్ పీ ఎస్ సీ మరో కీలక ప్రకటన విడుదల చేసింది. మున్సిపల్ ఏ ఈ పోస్టులకు నిర్వహించే పరీక్షను వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12 వ తేదీన ఈ పరీక్షా జరగాల్సి ఉంది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అదే రోజున దేశవ్యాప్తంగా గేట్ (GATE 2023) పరీక్షా జరుగనుంది. ఏఈఈ పరీక్షా అదే రోజున నిర్హాహిస్తే గేట్ కు ప్రిపేర్ అవుతున్న ఇంజనీరింగ్ అభ్యర్థులు ఆ అవకాశాన్ని కోల్పోతారని టీ ఎస్ పీ ఎస్ సీ గుర్తించింది. అందుకే ఏఈఈ పరీక్షని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 12 వ తారీఖున జరగవలసిన పరీక్షా మార్చి 5వ తారీఖునకు వాయిదా వేసింది.
No comments:
Post a Comment