Previous Questions

TSPSC & APPSC Special

Youtube

Previous Papers

TSPSC MP3

SSC MTS Previous Asked Questions

SSC MTS Quant

SSC General Awareness Previous Asked Questions

Just Fun

Geography

Indian History

General Awareness MCQ

Study Material

Quicker Maths

Banks Clerk Quant

Group II

Reasoning (Verbal & Non verbal)

Quantitative Aptitude

TS Group I Video Tutorials

Wednesday, 18 January 2023

Budget 2023: బడ్జెట్ లో నిరుద్యోగులకు వరాలు.. 10లక్షల ఉద్యోగాల ప్రకటన..

Budget 2023: ఈ సంవత్సరం ప్రజలను ఆకర్షించేందుకు కేంద్రం సిద్ధం అవుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి బడ్జెట్ లో ప్రసగించే అవకాశాలు ఉన్నాయి.

ఈ సంవత్సరం ప్రజలను ఆకర్షించేందుకు కేంద్రం సిద్ధం అవుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి బడ్జెట్(Budget) లో ప్రసగించే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రజలను ఆకర్షించేందుకు బడ్జెట్(Budget) ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధం అవుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. దీనిలో భాగంగా.. ఫిబ్రవరి 1, 2023న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోదీ(Modi) ప్రభుత్వ రెండో పర్యాయం చివరి సాధారణ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదే చివరి పూర్తి బడ్జెట్. దీంతో పాటు ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఈ బడ్జెట్ జనాదరణ పొందుతుందని నమ్ముతారు. అయితే కేంద్రం బడ్జెట్‌లో అత్యధికంగా ఉపాధి కల్పనపై దృష్టి పెట్టబోతోంది.

ఉపాధి కల్పన విషయంలో మోడీ ప్రభుత్వం విపక్షాలను లక్ష్యంగా చేసుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై ఎక్కువ దృష్టి పెట్టబోతోంది. ఉద్యోగాల కల్పన, సమాన ఆర్థిక సమానత్వం, అభివృద్ధి పథంలో ముందుకు సాగడం వంటి అంశాలే రెడ్ లెటర్‌లో(బడ్జెట్) ఉన్నాయని ఆర్థిక మంత్రి ఇటీవలే పేర్కొనడం కూడా ఇందుకు నిదర్శనం.

ఫిబ్రవరి 1, 2022న 2022-23 బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మౌలిక సదుపాయాల బలోపేతం కోసం మూలధన వ్యయం కింద రూ.7.5 లక్షల కోట్లు కేటాయించారు. ఇది ఉపాధి అవకాశాలను పెంపొందించడంతోపాటు భారత్‌లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడుతుందని అంచనా. రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిన ప్రభుత్వం ఈ బడ్జెట్‌లోనూ మూలధన వ్యయానికి ఎక్కువ నిధులు కేటాయించనుంది. ప్రభుత్వం ఈ అంశం మీద ఎక్కువ ఖర్చు చేస్తే.. అది ప్రపంచ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా సహాయపడుతుంది.

యువ పారిశ్రామికవేత్తలకు హామీ లేకుండా రుణం!

యువతలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి మోడీ ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్ద ప్రకటన చేయవచ్చు. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ప్రకటించవచ్చు. ఇందులో ఎలాంటి హామీ లేకుండా ఈ పారిశ్రామికవేత్తలకు రూ.50 లక్షల రుణం అందుబాటులో ఉంటుంది. ఇందులో మహిళా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రుణంలో 50 శాతం ప్రభుత్వం హామీ ఇస్తుంది. దీనితో పాటు.. పురుష పారిశ్రామికవేత్తల విషయంలో ప్రభుత్వం 25 శాతం గ్యారంటీ ఇస్తుంది. ఈ కొత్త వర్ధమాన పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇవ్వడం ఉపాధి అవకాశాలను పెంచడంలో సహాయపడుతుంది.

ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై దృష్టి..

జూన్ 14, 2022 న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోయే ఒకటిన్నర సంవత్సరాలలో అంటే 2023 చివరి నాటికి.. కేంద్ర ప్రభుత్వం తన వివిధ శాఖలు మరియు మంత్రిత్వ శాఖలలో 10 లక్షల మందిని రిక్రూట్ చేసుకుంటుందని ప్రకటించారు. నిజానికి అన్ని శాఖలు, మంత్రిత్వ శాఖల్లో మానవ వనరుల స్థితిగతులను సమీక్షించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రభుత్వంలో లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు, విభాగాల్లో దాదాపు 9.79 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. వ్యయ శాఖ వార్షిక నివేదిక ప్రకారం.. మార్చి 1, 2021 నాటికి, 9 లక్షల 79 వేల 327 పోస్టులు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాల పరిధిలో ఖాళీగా ఉన్నాయని కేంద్ర సిబ్బంది సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 

No comments:

Post a Comment