ఏపీలో ఎస్సై ఉద్యోగాలకు నిర్వహించిన ప్రిలిమ్స్ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (APSLPRB) విడుదల చేసింది. 411 పోస్టులకు గాను ఫిబ్రవరి 19న రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 1,51, 288 మంది అభ్యర్థులు హాజరుకాగా.. వారిలో 57,923 మంది అర్హత సాధించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి 1,553 అభ్యంతరాలను స్వీకరించినట్లు APSLPRB తెలిపింది. అర్హత సాధించిన అభ్యర్థులు మార్చి 4 ఉదయం 11 గంటల వరకు ఓఎంఆర్ షీట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. రెండు పేపర్లలో అర్హత సాధించిన వారికే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు APSLPRB తెలిపింది.
No comments:
Post a Comment