రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్సిఎఫ్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 550 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు 04 మార్చి 2023లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్సిఎఫ్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 550 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు 04 మార్చి 2023లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 550 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిట్టర్ విభాగంలో 215, వెల్డర్ విభాగంలో 230, Machinist 05, పేయింటర్ 05, కార్పెంటర్ 05, ఎలక్ట్రిషియన్ 75, మెకానిక్ 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆయా పోస్టుల ప్రకారం 10వ తరగతి వరకు చదివి ఉండాలి. అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా ఐటీఐ విద్యను కూడా సంబంధిత విభాగంలో పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యా సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి తమ విద్యను పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తుల సమర్పణ సమయంలో.. బయోడేటా, పదవ తరగతి, ఐటీఐ సర్టిఫికేట్లలో పేర్కొన్న విధంగా వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్, లైసెన్స్) లేదా.. పాస్పోర్ట్ సైజు ఫోటో స్కాన్ చేసి పెట్టుకోవాలి.
No comments:
Post a Comment