నిజామాబాద్ జిల్లా ఉపాధి అధికారి అందించిన వివరాల ప్రకారం, 12న ప్రైవేట్ రంగంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. ముతూట్ ఫైనాన్స్ కంపెనీ నియామకాలు చేపడుతుంది.
నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 12న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగ మేళాకు ముతూట్ ఫైనాన్స్ కంపెనీ వారు ఈ నియామకాలు చేపడుతున్నారు.
ఉద్యోగ నియమించుకునే కంపెనీ: ముతూట్ ఫైనాన్స్ కంపెనీ
ముఖ్యమైన తేదీలు
- ఇంటర్వ్యూ తేదీ: 12/06/2025 (ఉదయం 10.30 గంటల నుండి)
ఉద్యోగ విభాగాలు
- ప్రొబేషనరీ ఆఫీసర్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, ఇంటర్న్షిప్ ట్రైనీ ఉద్యోగాల కోసం నియామకాలు చేపడుతున్నారు.
వయోపరిమితి
- కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 26 సంవత్సరాలు
విద్య అర్హత
- ఏదైనా డిగ్రీ, ఎంబీఏ, ఎంకామ్ పాసైనవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు
ఉద్యోగ ఖాళీలు ఉన్న ప్రదేశాలు
- ఉద్యోగాలు నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, బాన్స్వాడ, పిట్లం, కామారెడ్డి, భైంసా, భీంగల్ ప్రాంతాల్లో ఉంటుంది
ఇంటర్వ్యూ స్థలం
- ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఉపాధి కార్యాలయం, శివాజీ నగర్, నిజామాబాద్ నందు 12.06.2025 నాడు ఉద్యోగ మేళా ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం లోపల అభ్యర్థులు తమ రెజ్యూమ్, బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలు తీసుకుని రావాలని నిజామాబాద్ జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు.
మరింత సమాచారం కోసం
- ఇతర వివరాలకు, 95817 68413, 99487 48428, 63057 43423, 77022 59070 ఫోన్ ద్వారా సంప్రదించగలరు.
No comments:
Post a Comment