ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ నిరుద్యోగులకు భారీ శుభవార్తను అందజేసింది. దాదాపు 35 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ నిరుద్యోగులకు భారీ శుభవార్తను అందజేసింది. దాదాపు 35 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ నిరుద్యోగులకు భారీ శుభవార్తను అందజేసింది. దాదాపు 35 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు.
గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు అర్హులైన నిరుద్యోగుల నుంచి పోస్టల్ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అయితే ఈ నోటిఫికేషన్ ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. ఎలక్షన్ కోడ్ కారణంగా వాయిదా పడింది.
అయితే ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 35000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఎంపిక విధానం కూడా పదో తరగతి మార్కుల ఆధారంగా ఉంటుంది. పదో తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసే అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా బీపీఎం, ఏబీపీఎం(అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టార్) వంటి పోస్టులను భర్తీ చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.10 వేల నుంచి రూ. 12 వేల వరకు ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://indiapostgdsonline.gov.in/ సందర్శించి వివరాలను తెలుసుకోవచ్చు. గతేడాది 50 వేలకు పైగా జీడీఎస్ పోస్టులను భర్తీ చేశారు.