Mother Tongue

Read it Mother Tongue

Saturday, 1 April 2023

ఎస్సై మెయిన్స్ అడ్మిట్ కార్డ్స్.. విడుదలపై కీలక ప్రకటన చేసిన TSLPRB

 తెలంగాణ ఎస్ఐ పోస్టులకు తుది రాత పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్స్ విడుదలపై కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 01 నుంచి తుది రాత పరీక్షల హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని TSLPRB ప్రకటించింది. ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఏఆర్, సివిల్ ఎస్సై పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎఎస్ఎల్‌పీఆర్‌బీ(TSLPRB) ప్రకటించింది. ఈ పరీక్ష ఆఫ్ లైన్ విధానంలో జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు ఒక పేపర్... మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మరొక పేపర్ ఉంటాయి. ఇలా రెండు రోజులు నాలుగు పేపర్లకు పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి ఇంగ్లీష్, తెలుగు పేపర్లు ఉండగా.. ఏప్రిల్ 9వ తేదీన జనరల్ స్టడీస్ అండ్ మ్యాథ్స్ పేపర్ పరీక్షలు ఉండనున్నాయి. హాల్‌టికెట్లను ఏప్రిల్ 03 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని టీఎఎస్ఎల్‌పీఆర్‌బీ(TSLPRB) ప్రకటించింది. ఏప్రిల్ 3 నుంచి 6 వరకు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. హాల్ టికెట్‌పై ఫొటో తప్పనిసరిగా ఉండాలని సూచించారు అధికారులు. మరిన్ని వివరాల కోసం, హాల్ టికెట్ డౌన్‌లోడ్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.tslprb.in/ సంప్రదించవచ్చని తెలిపారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లో మాత్రమే ఈ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. 83,449 మంది పురుషులు, 27,760 మంది మహిళలు సహా మొత్తం 1,11,209 మంది అభ్యర్థులు ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ (పీఎంటీ), ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌(పీఈటీ)లో అర్హత సాధించి అర్హత సాధించారని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రకటించింది.

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి