ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 31, 2019 న సెకండ్ గ్రేడ్ టీచర్ ఎక్సమ్ నిర్వహించింది. అందులో సోషల్ స్టడీస్ ప్రశ్నలు ఇవ్వబడినవి.
1) మధ్యధరా సముద్రం మీద నుండి వచ్చే తుఫాను వాయుగుండాలు
1) మామిడి జల్లులు
2) పశ్చిమ విక్షోభాలూ
3) రుతుపవనాలు
4) ఈశాన్యా గాలులు
2) ఖండచలన సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు
1) ఆల్ఫ్రెడ్ వెజినర్
2) విలియం మోరిస్ డేవిస్
3) జాన్ డాల్టన్
4) జిమ్ కాంటోర్
3) ఆదిమానవులు నివసించిన రాతిగుహ భీంబేడ్క ఉన్న రాష్ట్రము
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) మహారాష్ట్ర
4) మధ్యప్రదేశ్
4) ఖనిజములు మరియు అటవీ ప్రాంతములను పటములో సూచించుటకు ఉపయోగించు రంగులు వరుసగా,
1) ఆకుపచ్చ - తెలుపు
2) లేత ఎరుపు - ఆకుపచ్చ
3) తెలుపు - ముదురు ఆకుపచ్చ
4) నలుపు - తెలుపు
5) నదుల నీటిలో మరియు సముద్రపు నీటిలో ఉప్పు శాతం వరుసగా
1) 77.8% మరియు 2%
2) 2 మరియు 35%
3) 35% మరియు 77.8%
4) 98% మరియు 2%
6) భారత రాజ్యాంగంలో ప్రధాన మార్పులు చేయబడిన కాలం
1) 1971 -80
2) 1961 - 70
3) 1991 - 2000
4) 2001 - 2013
7) నైలునది ఈ సరస్సు నుండి పుట్టినది.
1) న్యాస
2) టాంగాన్యాకా
3) విక్టోరియా
4) మాలావి
8) గ్రామీణ ప్రాంతాలలో అట్టడుగు వర్గాల ప్రజలు వినియోగించే ఆహారము (కాలరీలో)
1) 1624
2) 2400
3) 2100
4) 1600
9) రసాయనిక ఎరువులు, పురుగు మందులను నిషేధిస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్రం
1) ఆంధ్రప్రదేశ్
2) సిక్కిం
3) తమిళనాడు
4) మిజోరాం
10) ఐరిస్ కెమెరా కనుగొనిన వారు
1) లూయీస్ డగ్యురే
2) జోసఫ్ నైస్ ఫోరే
3) జోహాన్ జాన్
4) మిమిజోయ్
11) భూమిలో ఇన్ని అడుగుల లోతు వరకు మనకు నల్లరేగడి మట్టి కనిపిస్తుంది.
1) 60 అడుగులు
2) 100 అడుగులు
3) 15 అడుగులు
4) 25 అడుగులు
12) సుల్హ్ - ఇ - కుల్ పద్దతి ఆధారంగా రాజ్యపాలన అమలు పరుచుటలో అక్బరుకు సహాయపడినవారు
1) తొడర్ మల్లు
2) అబుల్ ఫజిల్
3) షేర్ ఖాన్
4) బీర్బల్
13) మొదటి లోక్ సభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య
1) 542
2) 498
3) 489
4) 468
14) మొట్టమొదటి టాకీ చిత్రం 'భక్త ప్రహ్లాద' ను నిర్మించినవారు
1) బి. ఎన్. రెడ్డి
2) హెచ్. యమ్. రెడ్డి
3) రఘుపతి వెంకయ్య
4) వేదంతం రాఘవయ్య
15) పక్క రోడ్లు తయారు చేసే విధానాన్ని రూపొందించినవారు
1) మెక్ ఆడం
2) జేమ్స్ బ్రిండ్లి
3) స్టీఫెన్ సన్
4) అబ్రహం డర్బీ
16) సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం వెల్లడి చేయడానికి మినహాయింపు లేనిది
1) గోప్యంగా ఉంచుతారన్న భావనతో విదేశీ ప్రభుత్వాల నుండి అందిన సమాచారం
2) ఒక వ్యక్తి జీవితానికి లేదా భౌతిక భద్రతకు భంగం కలిగించే సమాచారం
3) పార్లమెంట్ హక్కులకు భంగం కలిగించే సమాచారం
4) సంస్థలోని అధికారుల మరియు ఉద్యోగుల అధికారాలు, విధుల గురించి సమాచారం
17) భారత ప్రభుత్వము మానవ హక్కులను కాపాడటానికి చట్టాన్ని చేసిన సంవత్సరం
1) 1993
2) 1994
3) 1995
4) 1996
18) మొత్తం వాతావరణంలో నీటి ఆవిరి ఘనపరిమాణం (శాతంలో)
1) 21
2) 78
3) 0.03
4) 0.4
19) ఈ క్రింది వారి ప్రభావంతో 'మజ్దూర్ మహాజన్' అనే కార్మిక సంఘం ఏర్పడినది.
1) నెహ్రూ
2) సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్
3) గాంధీజీ
4) సుభాష్ చంద్రబోస్
20) 'రామచరిత మానస్' ఈ క్రింది భాషలో వ్రాయబడింది.
1) సంస్కృతం
2) అవధి
3) తెలుగు
4) హిందీ
No comments:
Post a Comment