టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 పోస్టులకు సంబంధించి ఉద్యోగాలను పెంచుతూ వెబ్ నోట్
విడుదల చేసింది. ఇప్పటికే గ్రూప్ 4లో పోస్టులను పెంచుతూ సబ్ నోటిఫికేషన్
ఇచ్చిన టీస్పీఎస్సీ తాజాగా గ్రూప్ 3 పోస్టులను పెంచింది. పూర్తి వివరాలు
ఇలా ఉన్నాయి. జనవరి 27న తెలంగాణ(Telangana) ఆర్థిక శాఖ 2,391 పోస్టులకు
అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. బీసీ గురుకులాల్లో గ్రూప్-3
కింద 12, గ్రూప్-4 కింద 141 పోస్టులకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే గ్రూప్
4లో 141 పోస్టులను పెంచుతూ టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేయగా..తాజాగా
గ్రూప్ 3లో 12 పోస్టులను పెంచుతూ వెబ్ నోట్ విడుదల చేసింది. ఈ 12 పోస్టులు
మహాత్మాజ్యోతిబాఫూలే గురుకులకు సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు. ఈ
పోస్టులకు అర్హతగా.. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారుగా పేర్కొన్నారు. 18
నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలని పేర్కొన్నారు. జీతం రూ.24,280 నుంచి
రూ.72,850 మధ్య చెల్లించనున్నారు. ఆర్థికశాఖ ఇప్పటికే 60,929 ఉద్యోగాలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పుడు కొత్తగా అనుమతి ఇచ్చిన 2,391 ఉద్యోగాలను కలిపితే మొత్తం 63,320
ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ 2,391 ఉద్యోగాలలో బీసీ గురుకుల విద్యాలయాల్లో అత్యధికంగా 1,499 పోస్టులు
ఉన్నాయి. ఈ పోస్టులను గురుకుల నియామక మండలి ద్వారా భర్తీ చేస్తారు.
ఇప్పటికే గురుకుల పోస్టులు 10వేలకు పైగా ఆర్థిక శాఖ ఆమోదించింది. వాటితో
పాటు.. ఇవి అదనంగా ఉన్నాయి. ఇక ఈ 1499 పోస్టుల్లో టీచింగ్ పోస్టులతో పాటు..
నాన్ టీచింగ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వెబ్ నోట్ కొరకు ఇక్కడ క్లిక్
చేయండి. ఇప్పటికే 1363 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. తాజాగా ఈ 12
పోస్టులను కలుపుకుంటే.. 1375కు గ్రూప్ 3 ఉద్యోగాలు పెరిగాయి. డిసెంబర్ 30న తెలంగాణ
స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ (TSPSC) ఈ నోటిఫికేషన్ విడుదల
చేయగా.. దరఖాస్తుల ప్రక్రియను జనవరి 24 నుంచి ప్రారంభం అయ్యాయి.
దరఖాస్తులను ఫిబ్రవరి 23వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు తెలిపింది
టీఎస్పీఎస్సీ. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆరోజు సాయంత్రం 5 గంటల వరకు
తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 105
కేటగిరీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్,
సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్
తదితర పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు విధానం:
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తు ఫీజుగా.. రూ.200 ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.80 పరీక్ష ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఇదిలా ఉంటే.. గ్రూప్ 3 పరీక్షను జులై లేదా ఆగస్టు నెలలో నిర్వహిస్తామని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో నిర్వహిస్తామని పేర్కొంది.
No comments:
Post a Comment