నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) తాజాగా భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 500 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు తెలిపింది. దేశంలో ఉన్న నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ కార్యాలయాల్లో క్లాస్-III కేడర్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతూ ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది NICL. ఈ పోస్టులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను అర్హులుగా పేర్కొంది.
దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 500 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్లో 21 పోస్టులు, తెలంగాణలో 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్హతతో పాటు అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలని పేర్కొన్నారు. 01.10.2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఇచ్చారు.
అక్టోబర్ 24వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ కానుండగా.. నవంబర్ 11 చివరితేదిగా పేర్కొన్నారు. అప్లై చేసిన అభ్యర్థులకు ఆన్లైన్ ప్రిలిమినరీ, ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్, రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి వీటి ఆధారంగా ఫైనల్ సెలక్షన్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ.22,405- రూ.62,265 ఉంటుంది. పూర్తి వివరాలకు కంపెనీ అధికారిక వెబ్సైట్ https://nationalinsurance.nic.co.in/ చూడొచ్చు.
No comments:
Post a Comment