గ్రూప్ -1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీపై అభ్యంతరాల సమర్పణ గడువు ఇప్పటికే ముగిసింది. ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు అయ్యింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల కోసం అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 11వ తేదీన మళ్లీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను టిఎస్పిఎస్సి పగడ్భంధీగా నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్షా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. గ్రూప్ -1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీపై అభ్యంతరాల సమర్పణ గడువు ఇప్పటికే ముగిసింది. ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు అయ్యింది. ఈ పరీక్షకు హాజరైన మొత్తం 2,33,056 మంది అభ్యర్థుల ఒఎంఆర్ షీట్లను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులోకి ఉంచింది. గత నెల 28న టిఎస్పిఎస్సి(TSPSC) గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక 'కీ'ని విడుదల చేసి, ఈ నెల 1నుంచి జులై5 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. ప్రాథమిక కీ పై అభ్యర్థులు సమర్పించిన అభ్యంతరాలను ఆయా సబ్జెక్టు నిపుణులు పరిశీలించి తుది కీ ని ఖరారు చేయనున్నారు. అనంతరం రిజర్వేషన్లు, జోన్ల వారీగా మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రూప్1 ప్రిలిమరీ ఫలితాలు ఈ నెల చివరి వారంలో వెలువడే అవకాశాలు ఉన్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ తుది కీ ఖరారైన తర్వాత ఫలితాల ప్రక్రియను పూర్తి చేసి, మూడు నెలల సమయం ఇచ్చి ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేయనుంది. అక్టోబరు లేదా నవంబరు నెలల్లో గ్రూప్ -1 ప్రధాన పరీక్ష ఉండనున్నట్లు సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం ఇతర పరీక్షలు ఉండడంతో.. ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. TSPSC ప్రస్తుతం సెప్టెంబరు నెలాఖరు వరకు ఇతర పోటీ పరీక్షలతో షెడ్యూల్ బిజీగా ఉంది. దీంతో అక్టోబరు లేదా నవంబరులో గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

No comments:
Post a Comment