ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలోని యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి మొదలుకొని ఆపై చదువులు చదివి.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలో నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.
ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 4-10-2024న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య తెలిపారు. మెగా జాబ్ మేళాలో 19 ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయి. ఈ జాబ్ మేళాలో టెక్ మహీంద్రా (TECH Mahindra), గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, ఆరంభిందో ఫార్మసి వంటి ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి.
దీని కోసం పదవ తరగతి నుంచి B.Sc, M.Sc, ORGANIC CHEMISTRY, బీటెక్, ఎంబీఏ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చు. 04-10-2024 వ తేదీ ఉదయం 09:00 గంటల నుండి ఈ ఉద్యోగమేళా జరగనుంది. ఇందుకు సంబంధించిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ మెగా జాబ్ మేళా జరగనుంది. ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య తెలిపారు.
ఈ ఉద్యోగ మేళాలో ఎంపికైన వారికి.. ఉద్యోగి అర్హతను బట్టి జీతం పదివేల రూపాయలు నుంచి 3.5 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకురావాలని సూచించారు. ఇక అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ రావాల్సి ఉంటుందని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ కొరకు www.rkiuniverre.aprrdc.in అనే వెబ్సైట్లో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 77994 94856, 96427 35717 అనే నంబర్లను సంప్రదించవచ్చు.
No comments:
Post a Comment