Mother Tongue

Read it Mother Tongue

Saturday, 18 February 2023

30 వేల ఉద్యోగాలు కల్పిస్తాం.. PWC కీలక ప్రకటన..


 అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ PWC (Price water house Cooper) ఇండియాలో వచ్చే 5 సంవత్సరాల్లో 30వేల మందిని నియమించుకుంటుందని చైర్మన్ పేర్కొన్నారు. ఓ చర్చా కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలిపారు. ఆ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ.. ప్రపంచానికి నైపుణ్యాలను (స్కిల్) సరఫరా చేసే దేశంగా భారత్(India) మారుంతుందన్నారు. ప్రపంచంలో ఏ ఇతర దేశాల్లో లేని విధంగా టెక్నాలజీ, స్కిల్స్ ను ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెల్లిజెన్స్ ను వినియోగించుకోవడం భారత్ కు కలిసి వచ్చే అంశం గా పేర్కొన్నాడు. ప్రస్తుతం తమకు 31వేల మంది ఉద్యోగులున్నారని.. రాబోయో సంవత్సంరంలో మరో 30వేల మంది అవసరం అవుతారాని.. వారిని భారత్ నుంచి నియమించుకునే ప్రణాళికతో ఉన్నట్లు తెలిపారు.

గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తుంటే.. ప్రైస్‌వాటర్‌హౌజ్‌కూపర్ కంపెనీ మాత్రం భారీగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. వచ్చే ఐదేళ్లలో 30 వేల ఖాళీలు భర్తీ చేయడానికి ఈ కన్సల్టెన్సీ సంస్థ సిద్ధమైంది. దేశంలో కంపెనీ సేవలను విస్తృతపరచడంలో భాగంగా ఉద్యోగాల భర్తీ అనివార్యం కానున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. తద్వారా భారత్‌లో కంపెనీ శ్రామిక సిబ్బంది పెరగనుంది. ప్రస్తుతం దేశంలో కంపెనీలో మొత్తంగా 50వేల మంది ఉద్యోగులున్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ శ్రామిక సిబ్బందిని 80వేలకు చేర్చాలన్నది కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

PwC ఇండియా, PwC అమెరికా సంస్థలు సంయుక్తంగా భారత్‌లో కార్యచరణను చేపట్టనున్నాయి. గ్లోబల్ సెంటర్లను భారత్‌లో నెలకొల్పేందుకు జాయింట్ వెంచర్‌లో భాగమయ్యాయి. కంపెనీని విస్తరించడం, నాణ్యతను మెరుగుపరచడం, వృద్ధి సాధించడం, క్లైంట్ సంబంధాలను విస్తృతపరచడమే లక్ష్యంగా ఈ జాయింట్ వెంచర్ కొనసాగనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలో భౌగోళికంగా విస్తరించడానికి చాలా ఏళ్ల నుంచి PwC ఇండియా కృషి చేస్తున్నట్లు తెలిపింది. గతేడాది భారత్‌లో నోయిడా, భువనేశ్వర్, జైపుర్‌లలో PwC ఇండియా ఆఫీసులను ప్రారంభించడం ఇందుకు నిదర్శనం.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials