కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI)లిమిటెడ్ లో 214 పోస్టులను భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నవీ ముంబైలోని ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI)లిమిటెడ్ లో 214 పోస్టులను భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్, మేనేజ్మెంట్ ట్రెయినీ, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు జూన్ 12న ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా..అప్లయ్ చేయడానికి చివరి తేదీ జులై 2,2024. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ/ సీఎంఏ, బీఎస్సీ, బీకాం, లా డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఈ పోస్టులకు అప్లయ్ చేసే ముందు పోస్టుల వివరాలు, ఎంపిక ప్రక్రియ,విద్యార్హత తదితర వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. వీటన్నింటికి సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంది.
పోస్టుల వివరాలు
-జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ - 120 పోస్టులు: 50 శాతం మార్కులతో బీఎస్సీ అగ్రికల్చర్ ఉత్తీర్ణత. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు 45 శాతం మార్కులు సాధించాలి.
-జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) - 40 పోస్టులు: 50 శాతం మార్కులతో బీకాం డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు 45 శాతం మార్కులు సాధించాలి.
-జూనియర్ అసిస్టెంట్ (జనరల్)- 20పోస్టులు: బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ 50 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు 45 శాతం మార్కులు సాధించాలి.
-మేనేజ్మెంట్ ట్రెయినీ (అకౌంట్స్)- 20 పోస్టులు: సీఏ లేదా సీఎంఏ పాస్ అవ్వాలి
-మేనేజ్మెంట్ ట్రెయినీ (మార్కెటింగ్)- 11 పోస్టులు : అగ్రికల్చర్ మేనేజ్మెంట్లో ఎంబీఏ/ ఎంబీఏతో సమానమైన వ్యవసాయ సంబంధిత మేనేజ్మెంట్ కోర్సు పూర్తిచేయాలి.
-జూనియర్ అసిస్టెంట్ (హిందీ ట్రాన్స్లేటర్): 01 పోస్టు: డిగ్రీ (హిందీ)/ పీజీ డిగ్రీ (హిందీ). ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. హిందీ, ఇంగ్లిష్ ట్రాన్స్లేషన్ తెలిసి ఉండాలి. సంస్కృతంతోపాటు ఇతర భారతీయ భాషలపై అవగాహన ఉండాలి. జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉండాలి.
-అసిస్టెంట్ మేనేజర్(అఫీషియల్ లాంగ్వేజ్): 01 పోస్టు: కనీసం 50 శాతం మార్కులతో పీజీ డిగ్రీ (హిందీ) కలిగి ఉండాలి. డిగ్రీ వరకు ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. హిందీ ట్రాన్స్లేషన్ అర్హత ఉన్నవారికి ప్రాధ్యాన్యమిస్తారు.కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.
-అసిస్టెంట్ మేనేజర్ (లీగల్): 01 పోస్టు: కనీసం 50 శాతం మార్కులతో న్యాయశాస్త్రంలో డిగ్రీ (3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు) కలిగి ఉండాలి. అడ్వొకేట్గా కనీసం ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా ఏదైనా న్యాయసేవా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి
అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 32 ఏళ్లు, ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (NCL)కు మూడేళ్లు, PWBDలకు 10 నుంచి 15 ఏళ్లు, ఎక్స్ సర్వీస్మెన్కు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
జనరల్ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.
దరఖాస్తు విధానం
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష కేంద్రాలు
ముంబై,నవీ ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో, చండీగఢ్, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, పాట్నా, జైపూర్.
జీతం
అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు నెలకు రూ.40,000- రూ.1,40,000. మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు రూ.30,000- రూ.1,20,000. ఇతర పోస్టులకు రూ.22,000-రూ.90,000.
అప్లై ఆన్లైన్ మరియు నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment