ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. యువతలో వృత్తి నైపుణ్యాన్నిపెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. యువతలో వృత్తి నైపుణ్యాన్నిపెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి మొదలకొని ఆపై చదువులు చదివి.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల్లో ఉద్యోగ మేళానిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో ఈ నెల 21న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధికల్పనా అధికారిని పి. దీప్తి తెలిపారు. ఈ మినీ జాబ్ మేళాలో మూడు ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి. దీనికోసం పదవ తరగతి నుంచి B.SC, MSC, ORGANIC CHEMISTRY, బీటెక్, ఎంబీఏ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చు.
21-06-2024 వ తేదీ ఉదయం 09:00 గంటల నుండి ఈ ఉద్యోగ మేళా జరగనుంది. ఇందుకు సంబంధించిన కర్నూలు జిల్లా కేంద్రంలోని సి -క్యాంప్ లో ఉన్న జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని.. జిల్లా ఉపాధికల్పనా అధికారి పి. దీప్తి తెలిపారు .ఈ ఉద్యోగమేళాలో ఎంపికైన వారికి.. ఉద్యోగి అర్హతను బట్టి జీతం పదివేల రూపాయలు నుంచి 16,000 వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.
అదే విధంగా ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు. ఇక అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ రావాల్సి ఉంటుందని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్ :- 99081 14205 సంప్రదించాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం www.ncs.gov.in అనే వెబ్సైటు లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.
No comments:
Post a Comment