ఏపీ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలను ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (APSLPRB) విడుదల చేసింది. ఫలితాలను ఏపీఎస్ఎల్పీఆర్బీ (APSLPRB) వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కానిస్టేబుల్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరుకాగా.. వారిలో 95,208 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఆన్లైన్లో ఓఎంఆర్ షీట్లు అందుబాటులో ఉంటాయని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.
మొత్తం
6,100 పోస్టుల భర్తీ కోసం గతనెల 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రాంతాల్లోని 997 పరీక్షా కేంద్రాల్లో దీన్ని
నిర్వహించినట్లు రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. 200 మార్కులకు
నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో ఓసీలకు 40 శాతం, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ,
ఎక్స్సర్వీస్మెన్కు 30 శాతం కటాఫ్గా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఫలితాల కోసం క్లిక్ చేయండ
No comments:
Post a Comment