జూలై 01న జరగనున్న గ్రూప్-4 పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లును ఇవాల్టి (జూన్ 24) నుంచి అందుబాటులో ఉంచింది టీఎస్పీఎస్సీ. జులై 1న పేపర్-1 పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందు వరకు ఆన్లైన్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయి. వచ్చే నెల 01న నిర్వహించనున్న గ్రూప్-4 ఎగ్జామ్ లో అభ్యర్థుల వేలిముద్రల్ని టీఎస్పీఎస్సీ తప్పనిసరి చేయనుంది. పేపర్-1, పేపర్-2 పరీక్షల్లో అభ్యర్థుల వేలిముద్రలు తీసుకున్న తరువాతే ఓఎంఆర్ పత్రాల్ని ఇస్తారు. ఈ పరీక్ష నిర్వహణకు పకడ్భందీ ఏర్పాట్లు చేసింది టీఎస్పీఎస్సీ. 8,180 గ్రూప్-4 పోస్టులకు సంబంధించి 9.51 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈ పరీక్ష ఏర్పాట్లు గురించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలు నిర్వహించింది. ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించేటప్పుడు హాల్టికెట్తో పాటు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డును పరిశీలించనున్నారు. గతేడాది నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో బయోమెట్రిక్ అమలు చేశారు. కానీ ఆ ఎగ్జామ్ కు సంబంధించి చాలా మంది అభ్యర్థుల బయోమెట్రిక్ను తీసుకోలేకపోయారు. కొందరు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడం, పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి బయోమెట్రిక్ తీసుకోలేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు.. అభ్యర్థి గుర్తింపు కార్డు, ముఖాన్ని సరిచూసి సంతకం, వేలిముద్ర తీసుకోనున్నారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ముఖ్యమైన లింక్స్
- హాల్టికెట్లు కొరక ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

No comments:
Post a Comment