
IDBI పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 600 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను idbibank.in సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి. నేటి నుంచి వీటి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఏదైనా తత్సమాన డిగ్రీ నుండి ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 20 నుండి 25 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. రాత పరీక్ష , పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ముందుగా ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. తర్వాత ఎంపికైన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. పేపర్ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. దరఖాస్తు చేసుకునే జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 1000 ఫీజు చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీలకు ఫీజు రూ.200 చెల్లించాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను ఏడాదిపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సులో చేరుస్తారు. ఆ సమయంలో అభ్యర్థులు కోర్సు ఫీజు కింద రూ.3,00,000 చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు నిర్దేశించిన విధంగా విడతల వారీగా ఫీజు కట్టే వెసులుబాటు ఉంది. అర్హుత గల అభ్యర్థులకు ఐడీబీఐ బ్యాంకు ఎడ్యుకేషన్ లోన్ సైతం మంజూరు చేస్తుంది. కోర్సులో చేరేటప్పుడు అభ్యర్థులు మూడేళ్లు సర్వీస్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ.5000 ఇస్తారు. శిక్షణ కాలం 6 నెలలు ఉంటుంది. ఇంటర్న్షిప్ సమయంలో నెలకు రూ.15 వేలు చెల్లిస్తారు. ఇంటర్న్షిప్ 2 నెలలు ఉంటుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరినవారికి ఏడాదికి రూ.6.14 నుంచి రూ.6.50 లక్షల వరకు ఉంటుంది. విజయవాడ, విశాఖపట్నం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ కేంద్రాల్లో పరీక్ష సెంటర్లు ఉంటాయి. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 30గా పేర్కొన్నారు.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment