
తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులపై ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ విభాగంలో మొత్తం 1520 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. తాజాగా ఈ పోస్టుల సంఖ్యను పెంచింది కేసీఆర్ సర్కార్. తాజాగా ఈ పోస్టులకు అదనంగా మరో 146 పోస్టులను నోటిఫై చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఇటీవల హరీశ్రావు (Minister Harish Rao) తెలిపారు. అదనపు పోస్టులతో కలిసి మొత్తం ఖాళీల సంఖ్య 1,666కు పెరిగాయి. ఈ పోస్టులతో పాటు.. పోస్టులతో పాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్లో మరో 265 పోస్టులు కలిపి మొత్తంగా 1,931 ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వనిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు సెప్టెంబర్ 19 సాయంత్రం 5గంటల వరకు ఆన్లైన్లో https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాల నుండి 49 సంవత్సరాలకు పెంచింది. అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర నర్సెస్, మిడ్వైఫ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన సంస్థలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) ట్రైనింగ్ కోర్సు పాసై ఉండాలి. లేదంటే ఇంటర్ ఒకేషనల్ మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సును అభ్యసించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాది పాటు క్లినికల్ ట్రైనింగ్ చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 2023 జులై 1 నాటికి 18 నుంచి 49 ఏళ్లు మించరాదు. రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్సర్వీస్మెన్, ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి మూడేళ్లు చొప్పున వయో పరిమితి సడలింపు కల్పించారు. ఇంకా.. ఇంతకుముందు రాత పరీక్షకు 80 పాయింట్లు, సర్వీసుకు 20 పాయింట్లు వెయిటేజీ ఉండగా, ఇప్పుడు రాత పరీక్షకు 70 పాయింట్లు, ప్రభుత్వ సర్వీసుకు గాను గరిష్టంగా 30 పాయింట్లు నిర్దేశించింది ప్రభుత్వం. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించే వారికి 6 నెలలకు 2.5 పాయింట్లు, గిరిజన ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాల్లో సేవలు అందించే వారికి 6 నెలలకు 2 పాయింట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాలి. దానికి అదనంగా ప్రాసెసింగ్ ఫీజు రూ.200ల చొప్పున చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్లతో పాటు నిరుద్యోగ కేటగిరీ అభ్యర్థులకు ప్రాసిసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. వీటికి హైదరాబాద్, వరంగల్, ఖమ్మం , నిజామాబాద్ కేంద్రాలకు నిర్ణయించారు. దరఖాస్తుల సమర్పణకు అభ్యర్థులు డైరెక్ట్ గా ఇక్కడ క్లిక్ చేయండి. వెబ్ నోటీసు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. అప్లై ఆన్లైన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి .
No comments:
Post a Comment