
గ్రూప్-4 (TSPSC Group-4) పరీక్షకు సంబంధించిన ప్రైమరీ కీ, అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను టీఎస్పీఎస్సీ (TSPSC) ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో (https://www.tspsc.gov.in/) తమ ఓఎంఆర్ షీట్లను డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు ప్రైమరీ కీని చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు నుంచి ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లోని లింక్ ద్వారా కీపై అభ్యంతరాలను స్వీకరించారు. రెండు పేపర్లు కలిపి దాదాపు 17 ప్రశ్నలకు అభ్యంతరాలను తెలియజేసినట్లు సమాచారం. వీటిపై నిపుణుల కమిటీని సెప్టెంబర్ 10వ తేదీన ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వాటిలో ఎన్ని ప్రశ్నలకు డబుల్ అన్సర్లు ఉన్నాయి.. ఎన్ని ప్రశ్నలను డిలీట్ చేయాలి అనే తుది నిర్ణయాన్ని ఈ నిపుణుల కమిటీ తేల్చనుంది. ఈ ప్రక్రియ దాదాపు 14 రోజుల వరకు ఉంటుంది. దీని తర్వాత సెప్టెంబర్ చివరి వారంలో తుది కీ విడుదల చేస్తారు. గ్రూప్ 4 ఫలితాలను వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. తెలంగాణలో 8,180 గ్రూప్-4 సర్వీసుల ఉద్యోగాల భర్తీకి మొత్తం 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీని కోసం 2878 ఎగ్జామ్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్-4 పేపర్-1 జనరల్ స్టడీస్ కు 7,62,872 మంది హాజరు కాగా.. పేపర్-2 సెక్టరేరియల్ ఎబిలిటీస్ కు 7,61,198 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక దీంతో పాటు.. ఫైనల్ కీ విడుదల చేసిన మిగిలిన పరీక్షలకు సంబంధించి ఫలితాలను వెబ్ సైట్లో త్వరలోనే అప్ లోడ్ చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది. వరుసగా ఫలితాలను ప్రకటిస్తామని.. అభ్యర్థులు తమ సర్టిఫికేట్లను రెడీగా ఉంచుకోవాలని తెలిపారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఈ సారి ఒక్క పోస్టుకు ఇద్దరు చొప్పున పిలిచే అవకాశం ఉంది. అంతక ముందు ఒక్క పోస్టుకు ముగ్గురు చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు అభ్యర్థులను పిలిచేవారు. ఇప్పుడు ఆ పద్దతి మారనుంది.
ముఖ్యమైన లింక్స్
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment