Mother Tongue

Read it Mother Tongue

Friday, 17 March 2023

పేపర్ లీక్ కేసులో కొత్త ట్విస్ట్..ప్రధాన సూత్రధారి అతనే..సిట్ నివేదికలో ఏం తేలిందంటే?

 తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కలకలం రేపుతోంది. మొదట ఏఈ పేపర్ మాత్రమే లీక్ అయినట్లు గుర్తించిన పోలీసులకు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనితో గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో సహా పలు పరీక్షలను ఈరోజు TSPSC రద్దు చేసింది. ఈ క్రమంలో కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసుకు సంబంధించి దర్యాప్తు నివేదికను TSPSCకి సిట్ అందించింది. ఈ నివేదికలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ప్రవీణ్ అనుకుంటున్న తరుణంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో రాజశేఖర్ ప్రధాన సూత్రధారి అని అధికారులు గుర్తించారు. అంతేకాదు అతను ఉద్దేశ్యపూర్వకంగానే TSPSCలోకి వచ్చినట్లు తెలుస్తుంది. టెక్నీకల్ ఆఫీసర్ గా ఉన్న రాజశేఖర్ డిప్యుటేషన్ పై TSPSCకి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గా వచ్చాడు. ఈ క్రమంలో ప్రవీణ్ తో సంబంధాలు కొనసాగించాడు. ఆ తరువాత కంప్యూటర్ హ్యాక్ చేసి పాస్ వర్డ్ ను దొంగిలించినట్లు గుర్తించారు. శంకర్ లక్ష్మీ తాను పాస్ వర్డ్ ఎక్కడ రాయలేదని..చెప్పలేదని చెప్పడంతో రాజశేఖర్ హ్యాక్ చేసి పాస్ వర్డ్ దొంగిలించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఆ తరువాత ఓ పెన్ డ్రైవ్ లో 5 పరీక్ష పత్రాలను రాజశేఖర్ కాపీ చేసుకున్నాడు. అనంతరం ఆ పెన్ డ్రైవ్ ను ప్రవీణ్ కు ఇచ్చాడు. 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials