రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. BEL యొక్క ఘజియాబాద్ యూనిట్ కోసం ఈ నియామకాలను చేపట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ట్రైనీ ఇంజనీర్ మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ bel-india.in లో అప్లై చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 15ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు:
విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 38 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 12 ట్రైనీ ఇంజనీర్ పోస్టులు, 26 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు:
బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్ననారు. ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు జనవరి 1, 2023 నాటికి గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు.. ప్రాజెక్ట్ ఇంజనీర్కు గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment