న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ పరిధిలోని 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ' నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన సైంటిఫిక్, టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ విభాగాల్లో మొత్తం 598 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 4వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నారు.
ఖాళీల వివరాలు..
సైంటిస్ట్-బి: 71 పోస్టులు
సైంటిఫిక్ ఆఫీసర్/ ఇంజినీర్: 196 పోస్టులు
సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్: 331 పోస్టులు
మొత్తం : 598
విద్యార్హతల వివరాలు:
సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ విద్యార్హతల కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడాల్సి ఉంటుంది.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
No comments:
Post a Comment