Mother Tongue

Read it Mother Tongue

Thursday, 19 September 2024

నిరుద్యోగ యువతకు శుభవార్త.. ఈనెల 20న జాబ్ మేళా

 నిరుద్యోగ నిర్మూలన కోసం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు సైతం పలుచోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. దీంతో ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థులు ఉపాధి పొందుతున్నారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పలు స్వచ్ఛంద సంస్థలు నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ అందించిన అనంతరం వారికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థులు ఈ శిక్షణను పొంది ఉద్యోగాలు చేస్తున్నారు. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు సైతం స్టడీ సెంటర్లలో ఉచిత శిక్షణను అందజేస్తుంది. ఇందులో సైతం అనేక మంది అభ్యర్థులు ఈ స్టడీ సెంటర్లలో శిక్షణ పొంది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు.

జనగామ జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 20న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం. మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాదుకు చెందిన జోషిత గ్రూప్ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఈ జాబ్ మేళా ఉంటుందన్నారు. పదవ తరగతి ఆపై చదివిన వారు ఇందుకు అర్హులు.

అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసుగల యువకులు ఇందుకు అర్హులని చెప్పారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనం ఉంటుంది. ఆసక్తిగల నిరుద్యోగ యువకులు తమ బయోడేటా, విద్యా అర్హత సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు, పాస్ ఫోటోలతో ఈ నెల 20న జనగామ ఉపాధి కార్యాలయంలో జరిగే జాబ్ మేళాకు హాజరు కావాలని చెప్పారు. జిల్లాకు చెందిన నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 7995433040 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.



No comments:

Post a Comment

Job Alerts and Study Materials