ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి మొదలకొని ఆపై చదువులు చదివి.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలో నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ప్రభుత్వ ఐ.టి.ఐ. కళాశాలలో ఈనెల 10వ తేదీన మినీ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో 5 ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయి.
ఈ జాబ్ మేళాలో IT BRISK, Navata road transport, Fusion Micro Finance, Dixon Technology, వంటి ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి. దీనికోసం పదవ తరగతి నుంచి డిగ్రీ B.Sc, ఐటిఐ, డిప్లొమా ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చు.
సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం 9 గంటల నుండి ఈ ఉద్యోగ మేళా జరగనుంది. ఇందుకు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఈ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని.. జిల్లా ఉపాధికల్పనా అధికారి ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ ఉద్యోగం మేళాలో ఎంపికైన వారికి.. ఉద్యోగి అర్హతను బట్టి జీతం పదివేల రూపాయలు నుంచి 25 వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.
అదేవిధంగా ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకురావాలని సూచించారు. ఇక అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ రావాల్సి ఉంటుందని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
No comments:
Post a Comment