ఇంటర్లో 75 శాతానికిపైగా మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులన్నారు. ఎంపికై న వారికి మధురైలో 3 నెలల తరగతులు, చైన్నెలో 9 నెలల ఇంటర్న్ షిప్ ఉంటుందని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న నెహ్రూ యువ కేంద్రం వేదికగా ఈనెల 23వ తేదీన జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ తెలిపారు. ఐఐఎఫ్ఎల్ సంస్థ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థలో కస్టమర్ రిలేషన్షిప్ ఆఫీసర్, బ్రాంచ్ మేనేజర్, బ్రాంచ్ క్రికెట్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీ కోసం ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 180 ఖాళీలు ఉన్నాయని, 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చదివిన పురుషులు/ మహిళలుఅర్హులని అన్నారు. ఎంపికైన వారికి ఆకర్షణీయమైన జీతంతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయన్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలలో పనిచేయాల్సి ఉంటుందని కె. సుధ పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10 గంటలకు నెహ్రూ యువకేంద్రం వద్దకు తమ బయోడేటా, సర్టిఫికెట్లు, ఆధార్కార్డుతో హాజరు కావాలని కోరారు.
ఇంటర్మీడియెట్ విద్యార్హతతో ఐటీ పరిశ్రమలోకి ప్రవేశించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్ విద్య డీవీఈఓ శివ్వాల తవిటినాయుడు తెలిపారు. బుధవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ 2023- 2024లో ఇంటర్మీడియెట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఈ నెల 24న ప్రముఖ ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 24వ తేదీన జిల్లాలోని నరసన్నపేటలో ఉన్న జ్ఞానజ్యోతి డిగ్రీ కళాశాలలో ఉదయం 9గంటల నుంచి ఈ డ్రైవ్ మొదలవుతుందన్నారు.
ఇంటర్లో 75 శాతానికిపైగా మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులన్నారు. విద్యార్థులు ముందుగా కంపెనీ నిర్వహించే కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూలో అర్హత సాధించాల్సి ఉంటుందన్నారు. ఎంపికై న వారికి మధురైలో 3 నెలల తరగతులు, చైన్నెలో 9 నెలల ఇంటర్న్ షిప్ ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్న్షిషిప్ సమయంలో నెలకు రూ.10 వేలు శిక్షణ భృతి ఇస్తారని, శిక్షణ పూర్తిచేసిన విద్యార్థులకు ఏడాదికి రూ.1.70 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తారని అన్నారు. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ వంటి ఉన్నత విద్య కోర్సులు అభ్యసించేందుకుగాను హెచ్సీఎల్ టెక్ సహాయం చేస్తుందని చెప్పారు.
No comments:
Post a Comment