ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగులకు అలర్ట్. కర్నూలు జిల్లా ఉపాధికల్పనా కార్యాలయంలో 5వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పనా అధికారి దీప్తి తెలిపారు.జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగం ఉపాధి అవకాశాలు కలిపించేందుకు ఈ ఉద్యోగ మేళా నిర్వహించానున్నామని తెలిపారు. ఈ నెల 5వ తేదీన బి. క్యాంప్ లోని జిల్లా ఉపాధికల్పనా కార్యాలయంలో ఏర్పాటు చేసే ఈ ఉద్యోగ మేళాలో అపోలో, రాజా బ్యాగ్స్,సుజలా పైప్స్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్ వంటి నాలుగు ప్రముఖ కంపినిలు తమ సంస్థలో ఖాలి స్థానాలను భర్తీ చేసేందుకు ఈ ఉదొగ మేళలో పాల్గొంటున్నాయి. దీనికోసం పదవ తరగతి నుంచి B.SC, MSC, ORGANIC CHEMISTRY, బీటెక్, ఎంబీఏ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు వయసు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు.ఈ ఉద్యోగ మేళాలో పాల్గొన వచ్చు. ఏంపికైన వారికి ఉద్యోగి అర్హతను బట్టి జీతం 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఉంటుంది. అదేవిధంగా ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు. ఇక అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ రావాల్సి ఉంటుందని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉద్యోగ మేళా జరుగు స్థలం కర్నూలు జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం కర్నూలు సమయం ఉదయం 10:00 గంటలకు నిరుద్యోగులు ముందుగా www.ncs.gov.in అనే వెబ్సైటు లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 99081 14205 సంప్రదించాలని తెలిపారు.
No comments:
Post a Comment