విద్యార్థులందరూ కూడా 10 గంటలకు చేరుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలియజేశారు. నిరుద్యోగ యువకులకు అవకాశం ఉన్నంతవరకు అధిక సంఖ్యలో పలు కంపెనీలు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమనితెలియజేశారు.
ఉత్తరాంధ్రలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగ యువతకు ఇది గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు స్థానిక నేషనల్ కెరీర్ సెంటరులో నెల 26 న జాబ్ మేళా నిర్వహించనున్నారని ఎంప్లాయిమెంటు అధికారి ఎన్. శ్యామ్సుందర్ ఓ పత్రికా ప్రకటన ద్వార తెలియజేసారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రముఖ కంపెనీలు, సుమారు 200 పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అర్హులైన నిరుద్యో గులు దరఖాస్తు చేసుకోవచ్చని, టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, ఐటీఐ, డిప్లమో, బి/డి/ఎం ఫార్మ సీ పూర్తి చేసిన వారంతా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చన్నారు. ఎంపికైన అభ్యర్థులకు అర్హతల ఆధారంగా రూ.10వేల నుంచి రూ.3 లక్షల వేతనం వరకు ఉంటుందని, విశాఖ, విజయనగరం, అనకాపల్లి, తుని ప్రాంతాల్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారంతా హాజరు కావచ్చని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు స్కిల్ యూనివర్సిటీడాట్ ఏపీ.ఎస్.ఎస్.డి.సి అనే వెబ్సైట్లో , https/employment.ap.gov.in రిజిస్ట్రేష్రన్ చేసుకుని అడ్మిట్ కార్డుతో హాజరు కాగలరని, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా కలదని తెలిపారు.
పైన తెలిపిన విధంగా విద్యార్థులందరూ కూడా 10 గంటలకు చేరుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలియజేశారు. నిరుద్యోగ యువకులకు అవకాశం ఉన్నంతవరకు అధిక సంఖ్యలో పలు కంపెనీలు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమనితెలియజేశారు. ఇప్పటి వరకు అనేక మంది విద్యార్థులకు మెగా జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడమైందన్నారు. విద్యార్థులందరూ కూడా చదువుకొని ఖాళీగా ఉండకుండా మెగా జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాన్ని కల్పించుకోవాలని తెలియజేశారు. తమ నైపుణ్యాన్ని బట్టి పలు కంపెనీల్లో తీసుకోవడం ఉంటుదన్నారు. ఎప్పటికప్పుడు మెగా జాబ్ మేళా ద్వారా ఉపాధి కల్పిస్తామన్నారు.
No comments:
Post a Comment