సింగరేణిలో 558 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని సంస్థ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం పోస్టుల్లో 277 పోస్టులను నిరుద్యోగ అభ్యర్థులతో.. మిగిలిన 281 పోస్టులను ఇంటర్నల్ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు.
మిగతా.. 30 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు; మేనేజ్మెంట్ ట్రైనీలు.. మైనింగ్ (79); ఎలక్ట్రికల్, మెకానికల్ (66), సివిల్ (18), ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ (10), ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ (18), ఐటీ (7), హైడ్రోజియాలజిస్ట్ (2), పర్సనల్ (22)తో పాటు 3 జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, 10 జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్, 16 సబ్ ఓవర్సీర్ ట్రైనీ (సివిల్) పోస్టుల భర్తీకి నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి రాతపరీక్ష నిర్వహిస్తారు.
No comments:
Post a Comment