దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంగఠన్(KVS)లో పలు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్(Notification) జారీ అయింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తంగా 13 వేలకు పైగా ఫోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా టీజీటీ, పీజీటీ, పీఆర్టీ వంటి టీచింగ్, నాన్ టీచింగ్(Non Teaching) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. KVS రిక్రూట్మెంట్ పరీక్ష 2022 షెడ్యూల్ను ఇటీవల విడుదల చేసింది. KVSలో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా షెడ్యూల్ను తనిఖీ చేయవచ్చు. దీనికి సంబంధించి KVS యొక్క అధికారిక వెబ్సైట్ను kvsangathan.nic.in సందర్శించాలి. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 13 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తారు.
ఇదిలా ఉండగా.. KVS రిక్రూట్మెంట్ పరీక్ష 07 ఫిబ్రవరి 2023 నుండి ప్రారంభమవుతుంది. 06 మార్చి 2023 వరకు కొనసాగుతుంది. 07 ఫిబ్రవరి 2023న అసిస్టెంట్ కమీషనర్ పోస్టుకు పరీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 08న ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి పరీక్ష జరగనుంది. ఫిబ్రవరి 09 న, వైస్ ప్రిన్సిపాల్ మరియు PRT (సంగీతం) పోస్టులకు పరీక్ష ఉంటుంది. అయితే ఈ మూడు కేటగిరీలకు సంబంధించి తాజాగా అధికారులు ఓ వెబ్ నోట్ విడుదల చేశారు. వీటికి దరఖాస్తుల చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి పరీక్ష సెంటర్ ను తెలుసుకునేందుకు లింక్ యాక్టివేట్ చేశారు. ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ విధానంలో జరుగుతుంది. పీఆర్టీ మ్యూజిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ లింక్ పై క్లిక్ ఇచ్చి పరీక్ష సెంటర్ ను తెలుసుకోవచ్చు. ఇక ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అసిస్టెంట్ కమీషనర్ పోస్టులకు దరఖాస్తు చేసకున్న అభ్యర్థులు ఈ లింక్ ద్వారా పరీక్ష సెంటర్ ను తెలుసుకోవచ్చు. అయితే అడ్మిట్ కార్డులను మాత్రం పరీక్షకు రెండు రోజుల ముందు వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
-TGT పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష 12 నుండి 14 ఫిబ్రవరి 2023 వరకు జరుగుతుంది.
-అదేవిధంగా.. 16 నుండి 20 ఫిబ్రవరి 2023 మధ్య PGT పోస్ట్ కోసం పరీక్ష నిర్వహించబడుతుంది.
- ఫైనాన్స్ ఆఫీసర్, ఏఈ (సివిల్), హిందీ ట్రాన్స్లేటర్ పోస్టులకు ఫిబ్రవరి 20న పరీక్ష జరగనుంది.
-PRT పోస్ట్ కోసం పరీక్ష 21 నుండి 28 ఫిబ్రవరి 2023 వరకు జరుగుతుంది.
-జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పరీక్ష 01 నుండి 05 మార్చి 2023 వరకు జరుగుతుంది.
-స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II పోస్టులకు మార్చి 05న నిర్వహించనున్నారు.
- లైబ్రేరియన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు మార్చి 6న పరీక్ష జరగనుంది.
పోస్టులు ఇలా..
ప్రిన్సిపల్- 239 పోస్టులు, వైస్ ప్రిన్సిపాల్- 203 పోస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ)-1409 పోస్టులు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ)- 3176 పోస్టులు, ప్రైమరీ టీచర్(పీఆర్టీ)-6414, లైబ్రేరియన్- 355 పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్- 52 పోస్టులు, పీఆర్టీ(మ్యూజిక్)- 303 పోస్టులు, ఫైనాన్స్ ఆఫీసర్- 06 పోస్టులు, అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్)- 02 పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎస్వో)-156 పోస్టులు, హిందీ ట్రాన్స్లేటర్- 11 పోస్టులు, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(యూడీసీ)- 322 పోస్టులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎల్డీసీ)- 702 పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2-54 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హత ప్రమాణాలు..
పోస్టును బట్టి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) పేపర్-2 క్వాలిఫై అయి ఉండాలి. PGT(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 40 ఏళ్లకు మించకూడదు. TGT(ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్), లైబ్రేరియన్ పోస్టులకు 35 సంవత్సరాలు, PRT పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
No comments:
Post a Comment