వరుసగా వివిధ సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు 11 రోజులు జరగనున్నాయి. దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ రెండు వెబ్ నోట్స్ విడుదల చేసింది. వీటికి అడ్మిట్ కార్డులను పరీక్ష జరిగే వారం ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇటీవల టీఎస్పీఎస్సీ నుంచి పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల కాగా.. వాటిలో చాలా వరకు పరీక్షలు నిర్వహించారు. మరికొన్ని నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. దీనిలో భాగంగానే తాజాగా టీఎస్పీఎస్సీ రెండు నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల తేదీలను ప్రకటించింది. ఆగస్టు 08వ తేదీన అకౌంట్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. దీంతో పాటు.. జూనియర్ కాలేజీ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది. వీటిని సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 03 వరకు ఉదయం, సాయంత్రం ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. వరుసగా వివిధ సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు 11 రోజులు జరగనున్నాయి. దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ రెండు వెబ్ నోట్స్ విడుదల చేసింది. వీటికి అడ్మిట్ కార్డులను పరీక్ష జరిగే వారం ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇదిలా ఉండగా.. గ్రూప్ 1 పరీక్షను వచ్చే నెల 11వ తేదీన నిర్వహించనున్నారు. అయితే దీనిపై నిరుద్యోగులు కోర్టును ఆశ్రయించారు. గ్రూప్ 1 ప్రలిమ్స్ పరీక్షపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ 36 మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ ను మే 25న విచారించనుంది. పేపర్ లీక్ ఘటనతో గ్రూప్ 1 రద్దైన విషయం తెలిసిందే. దీంతో రెండు నెలల క్రితమే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే టీఎస్పీఎస్సీ మాత్రం పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. అయితే అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్ష వాయిదాతో పాటు.. గ్రూప్ 2, 3, 4 పరీక్షలకు మధ్య రెండు నెలల సమయం ఇవ్వాలని కోరుతూ ఆ పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

No comments:
Post a Comment