ఇండియన్ రైల్వే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నార్త్ వెస్టర్న్ రైల్వే అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 238 పోస్టులను భర్తీ చేయనున్నారు. జనరల్ డిపార్ట్ మెంట్ కాంపిటీషన్ ఎగ్జామినేషన్ (GDCE) అభ్యర్థులను ఈ నోటిఫికేషన్ ద్వారా నియమించనుంది. దీనిలో ఎంపికైన అభ్యర్థులు నార్త్ వెస్టర్న్ రైల్వే పరిధిలో పని చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా రాత పరీక్ష, సర్టిఫికేట్ల పరీశీలన, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. లెవల్ గ్రేడ్ 2 పే లెవల్ అధారంగా శాలరీ ఉంటుంది. మొత్తం 238 పోస్టుల్లో జనరల్ కేటగిరీ కింద 120, ఎస్సీ 36, ఎస్టీ 18, ఓబీసీ కింద 64 పోస్టులను కేటాయించారు.
ముఖ్యమైన తేదీలు
- ఏప్రిల్ 07 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది
- మే 06, 2023 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు
వయోపరిమితి
- కనిష్ట వయస్సు 15 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
విద్యార్హత
- అభ్యర్థులు పదో తరగతితో పాటు.. సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి
- అభ్యర్థుల యొక్క మెడికల్ స్టాండర్డ్ ఏ 1గా ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు
దరఖాస్తు రుసుము
- దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
అధికారిక వెబ్సైటు
- పూర్తి వివరాలకు http://www.rrcjaipur.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు
No comments:
Post a Comment